లాడ్జీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం... ఒక యువతి.. ఇద్దరు యువకులు..

సోమవారం, 21 జూన్ 2021 (11:19 IST)
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోని లాడ్జీల్లో అసాంఘిక కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. తాజాగా వనస్థలిపురంలోని ఓ లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న యువతితో పాటు నలుగురు యువకులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. 
 
చింతల్‌కుంటలోని మనోహర్‌ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయం తెలుకున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి లాడ్జిపై దాడి చేశారు. ఒక యువతి, విటులను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లాడ్జి రూం నం.109లో సోదాలు చేయగా, అందులో ఓ వ్యక్తి, మహిళను అదుపులోకి తీసుకున్నారు. 
 
అలాగే, ముగ్గురు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించామన్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి వారి వద్ద నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రూ.6500 నగదును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు