ప్రపంచంలోనే భారత దేశానికి మంచి గుర్తింపు.. కిషన్ రెడ్డి

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:27 IST)
స్వచ్ఛ భారత్ వలన ప్రపంచంలోనే భారత దేశానికి ఒక మంచి గుర్తింపు వచ్చిందని హోం శాఖ సహాయ మంత్రి హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. "రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 
 
మహాత్మా గాంధీ 150 జయంతి వేడుకలు సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రధాని పిలుపు మేరకు గత నాలుగు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. 
 
స్వచ్ఛ భారత్ కార్యక్రమం వలన దేశ వ్యాప్తంగా 10 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. ఇంకా మరుగుదొడ్లు లేని వారు ఉంటే మీరు కోరుకున్న స్థలాల్లో ప్రభుత్వం కట్టేందుకు సిద్ధంగా ఉంది. నగరంలో నిర్దేశించిన స్థలంలో చెత్తను వెయ్యాలి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలి. స్వచ్ఛ భారత్ వలన ప్రపంచంలోనే భారత దేశానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది" అన్నారు.
ఈ సందర్భంగా పలువురుకి మొక్కలు పంపిణీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు