మొసలి కన్నీరు కార్చడం మీ నాయకత్వం లక్షణం : రేవంత్‌పై కవిత ఫైర్

మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:34 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్సీ కె.కవిత మండిపడ్డారు. మొసలు కన్నీరు కార్చడం ఆపాలని రేవంత్‌కు ఆమె హితవు పలికారు. అంతేకాకుండా, ఈ మొసలి కన్నీరు కార్చడం మీ నాయకత్వం లక్షణం అంటూ విమర్శలు చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ తల్లిని, తెలంగాణ అమరవీరులను అవమానించినపుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రేవంత్‌ను ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ నమ్మొద్దంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. 
 
కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు పదేపదే అవమానిస్తున్నారని, అలాంటి సమయంలో మీ పార్టీకి మద్దతుగా సీఎం కేసీఆర్ మాట్లాడారని కవిత తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండిచారన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలను కేసీఆర్ నిలబెట్టారని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు