తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా-462 మందికి పాజిటివ్

శనివారం, 2 జులై 2022 (09:49 IST)
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,518 కరోనా పరీక్షలు నిర్వహించగా, 462 పాజిటివ్ కేసులు నమోదైనాయి. అత్యధికంగా హైదరాబాదులో 259 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 35 కేసులు గుర్తించారు.
 
ఇంకా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 35 కేసులు గుర్తించారు. అదే సమయంలో 403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,01,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,92,593 మంది రికవరీ అయ్యారు. ఇంకా 4,702 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు