ఆడ, మగ అనే భేదం విడనాడాలి : జగ్గీవాసుదేవ్‌

మంగళవారం, 28 నవంబరు 2017 (11:45 IST)
ఆడ, మగ అనే లింగ భేదం చూపించకుండా అంతా మనుషులమేనన్న భావన కలిగితే సమాజం గొప్పగా తయారవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీవాసుదేవ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ సంస్థ నిర్వహించిన నాయకత్వంలో మహిళా సాధికారత సదస్సును ఎంపీ కవితతో కలిసి ఆయన స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా కవితతో సుమారు గంటన్నర పాటు ముఖాముఖి నిర్వహించిన జగ్గీవాసుదేవ్‌ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. గత 20 ఏళ్లలో మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఆడ, మగ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టొద్దని, దేశంలో ఇప్పటికే కులాల వారీగా రిజర్వేషన్లు ఉండటం వల్ల ఎంతోమంది బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు