ఆంధ్రా అధికారివి... నీయయ్య.... నాకే ఎదురు చెప్తావా? : తెరాస ఎమ్మెల్యే బూతుపురాణం

ఆదివారం, 10 డిశెంబరు 2017 (11:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరోమారు ఆంధ్రా అధికారిపై అధికార తెరాస ఎమ్మెల్యే ఒకరు బూతు పురాణం లంఘించారు. "ఆంధ్రా అధికారివి... నీయయ్య నాకే ఎదురొస్తావా?" అంటూ పరుషపదజాలంతో దూషించారు. ఈ ఎమ్మెల్యే బూతుపురాణానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీజీఎం లక్షమ్మ నిధుల దుర్వినియోగం కేసులో సస్పెండ్ అయింది. ఆమె తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓ మదన్ మోహన్‌కు వేముల వీరేశం ఫోన్ చేశాడు. ఈ విషయం తన పరిధిలోది కాదని సీఈవో సమాధానం ఇస్తుండగానే, "నా మాటకే ఎదురు చెప్తావా... ఆంధ్రా అధికారివి" అంటూ నోరు జారడంతో పాటు రాయడానికి వీల్లేని బూతులు తిట్టాడు. అడిగిన పని చేయకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా, వీరేశం వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
కాగా, గతంలో ఓ కాలేజీ యజమానిని చంపుతానని హెచ్చరించి, దాని ఆడియో బయటకు రావడంతో మార్ఫింగ్ చేశారని ఎదురు ఆరోపణలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం మరో వివాదంలో చిక్కాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు