కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి విద్యార్థినిపై అత్యాచారం.. అర్ధనగ్నంగా ఫోటోలు తీసి..?

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:18 IST)
సిరిసిల్ల జిల్లాలో నిన్న ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా అదే జిల్లాలో మరో విద్యార్థినిపై అత్యాచారం చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్‌ చదివే ఓ విద్యార్థిని (16)ను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించాడు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చేశాడు. 
 
ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబితే వీడియోలు ఇంటర్నెట్‌లో పెడుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఫొటోలు అడ్డం పెట్టుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులురాలు ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులను ఆశ్రయించారు. 
 
డీఎస్పీ చంద్రశేఖర్‌ ఆ యువకుడితో పాటు అతనికి సహకరించిన మరికొందరిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారిస్తున్నారు. కాగా.. గంజాయి మత్తులో ఆ యువకుడితో పాటు మరికొందరు కలిసి గ్యాంగ్‌రేప్‌ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు