రేవంత్‌పై వేటుకు సర్వం సిద్ధం.. చంద్రబాబు రాకే తరువాయి

బుధవారం, 25 అక్టోబరు 2017 (16:19 IST)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్వదేశానికి రాగానే వేటు నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ విషయంపై ఆయన బుధవారం ఓ స్పష్టత ఇచ్చారు. 
 
గురువారం టీడీఎల్పీ సమావేశాన్ని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా నేతలందరికీ లేఖలు పంపారు. అయితే, పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ సమావేశం నిర్వహించడానికి వీల్లేదంటూ ఎల్. రమణ ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా దూరంగా ఉండాలని ఆయన కోరారు. 
 
ఆయన వ్యవహారంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. లండన్‍‌లో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ కోసం ఏ నిర్ణయమైనా తీసుకోవాలని  రమణకు చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు