రామ్ చరణ్ 'ఎవడు'తో పవన్ కల్యాణ్‌కు తలనొప్పి!

బుధవారం, 10 జులై 2013 (12:27 IST)
FILE
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'ఎవడు' సినిమా రిలీజ్ డేట్‌పై గత కొద్ది రోజులుగా ఉత్కంఠత నెలకొంది. ఈ సినిమాని ఈనెల 31న విడుద‌ల చేయాల‌ని చిత్ర నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు‌. ఈ సినిమాని ముందుగా జూలై 25 న రిలీజ్ చేయ్యాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ వారం ఆలస్యంగా రానుంది. దీంతో ఈ సినిమా ఎఫెక్ట్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాపై పడే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ 'అత్తారింటింకి దారేది' సినిమాను ఆగష్టు 7న రిలీజ్ చెయ్యాలని పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యారు. మరి రామ్ చరణ్ 'ఎవడు' జూలై 25న విడుదలయితే, పవన్ కల్యాణ్ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సినిమాకి దీనికి మధ్య చాలా తక్కువ రోజుల గ్యాప్ ఉండటంతో పవన్ కాంప్రమైజ్ అయ్యి తన సినిమాను వాయిదా వేస్తాడో లేదంటే అబ్బాయికి పోటీగా బరిలోకి దిగుతాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి