ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి, సినీ నటి నీతూ అగర్వాల్కు ఉన్న లింకుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పోలీసులు నీతూ అగర్వాల్ను శనివారం రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేసి కర్నూలు జిల్లా రుద్రవరంకు తరలించిన విషయం తెల్సిందే.
అంతేకాకుండా, నీతూ ఉపయోగించిన కారుని పోలీసులు సీజ్ చేశారు. మస్తాన్వలీ, నీతూ అకౌంట్ల మధ్య భారీగా నగదు బదిలీలు జరిగినట్టు గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లర్లు, గంగిరెడ్డితో నీతూకున్న సంబంధాలపైనా విచారణ జరుపుతున్నారు. ఇదిలావుండగా, నీతూని ఆళ్లగడ్డ కోర్టు ఎదుట ప్రవేశపెట్టినున్నట్టు కర్నూలు ఎస్పీ మీడియాకు తెలిపారు.