జగన్ పార్టీలోకి స్టార్ హీరోయిన్.. రోజాకు చెక్ పెట్టేందుకేనా?

మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (19:22 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ సీపీలోకి మరో టాలీవుడ్ మాజీ హీరోయిన్ చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి ప్రస్తుతం వైకాపాలో కేవలం నటి రోజా మాత్రమే ఉన్నారు. ఆమెకు మించిన నటి ఆ పార్టీలో లేదని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో జగన్ పార్టీలో మరో హీరోయిన్ చేరబోతున్నట్టు సమాచారం. 
 
ఎన్నో చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించిన రాశి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మధ్యే రాశి జగన్‌ని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో కలిశారు. అయితే తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా జగన్‌ ఆశీర్వాదం కోసమే తన భర్తతో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చినట్టు రాశి వివరణ ఇచ్చారు. 
 
నిజానికి ఈ మాటల్లో ఏమాత్రం నిజం లేదన్నది వైకాపా నేతలు చెపుతున్నారు. ఆమె వైకాపాలో చేరేందుకే జగన్‌ను కలిసినట్టు సమాచారం. వాస్తవానికి వైసీపీలో మహిళా నాయకులు ఉన్నా... రోజా తప్ప ఇంకెవరికి అంత ఫేమ్‌ లేదనేది వాస్తవం. అందుకే సినీ గ్లామర్‌ని పార్టీకి జోడించాలని జగన్ భావిస్తున్నారట. దీంతో రాశిని పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి