అంతేకాదు మరో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి నటించనుందని సమాచారం. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని సినీనిపుణులు అంటున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు.. రావు రమేష్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. 'ప్రేమమ్' సినిమా విడుదలైన తర్వాత, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు.
ఈ చిత్రానికి 'ఒకసారి ఇటు చూడవే' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్గా ఉండనుందట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు నెలలో ప్రారంభంకానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.