టాలీవుడ్లో ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు పోయి ఇప్పుడు ఏకంగా ముగ్గురు హీరోయిన్ల హవా నడుస్తోంది. స్టార్ హీరోలంతా ముగ్గురేసి భామలతో రొమాన్స్ చేస్తుంటే చిన్నహీరోలు కూడా...మేము కూడా ఎందులో తక్కువ మాకు ముగ్గురు హీరోయిన్లు కావాలంటున్నారు. వాళ్లల్లో అల్లు శిరీష్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం ''శ్రీరస్తు శుభమస్తు'' సినిమా చేస్తున్న అల్లు శిరీష్ ఆ తర్వాత ఎం.వి.ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
ఈ చిత్రంలో ఈ కుర్రాడి సరసన ముగ్గురు భామలు జోడి కట్టనున్నట్లు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరెవరో తెలుసా... ''కృష్ణ గాడి వీరప్రేమ గాథ''లో హీరోయిన్గా నటించిన మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా ఇప్పటికే ఎంపికైంది. మరో హీరోయిన్గా ''మోసగాళ్లకు మోసగాడు'' భామ నందిని రాయ్ పేరు వినిపిస్తోంది. ఇక మూడో హీరోయిన్ కోసం వెతుకులాట జరుగుతుంది.
ఇప్పటివరకు అల్లు శిరీష్ చేసిన రెండు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించిన అల్లు శిరీష్ రాబోయే సినిమాలో తనలోని రొమాంటిక్ యాంగిల్ను బయటపెడుతున్నాడు. అల్లు అర్జున్ పూరి దర్శకత్వంలో ఇద్దరమ్మాయిలతో సై అన్నట్టు.. ఈ సినిమాతో అల్లు శిరీష్ ముగ్గురు ముద్దుగుమ్మలతో సై అంటాడేమో.. ''శ్రీరస్తు శుభమస్తు'' పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ని చేయనున్నాడు. కుర్రాడి ఊపు చూస్తుంటే ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.