ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేశాడో కుమారుడు. తాడికొండ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన వేల్పూరి శివయ్య (57) అనే వ్యక్తి ఈపూరు మండలం పొనుగోటివారి పాళెంలోన ఓ కోళ్లఫారంలో పనిచేస్తుంటారు. ఆయనకు భార్య, కుమారుడు నరేంద్ర, ఓ కుమార్తె ఉంది. కుమారుడుకి వివాహమైంది. ఆ తర్వాత కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. దీంతో శివయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.
అప్పుడప్పుడూ గ్రామంలోని తల్లిని చూసేందుకు వస్తుంటారు. ఈ నెల 9న రాత్రి 8.30 సమయంలో గ్రామంలోనే వేరుగా ఉంటున్న భార్య, పిల్లల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన పేరుపై ఉన్న 1.40 ఎకరం భూమి విషయంలో నరేంద్ర గొడవకు దిగాడు. ఆస్తి తనకు రాయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు.