కరోనా పెరిగిపోతుంటే.. పొట్టి దుస్తుల పోస్టులు అవసరమా అనసూయా..? (video)

శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (18:39 IST)
బుల్లితెరకు గ్లామర్ బ్యూటీ అనసూయ పొట్టి దుస్తులలో మెరవడం కొత్తేమి కాదు. కాని ఇలాంటి దుర్భర పరిస్థితులలో పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావు అని కొందరు కడిగి పారేస్తున్నారు. 
 
వీటికి అనసూయ కూడా ధీటుగా బదులిస్తుంది. వివరాల్లోకి వెళితే అనసూయ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రాములో ట్రెండీ వేర్ దుస్తులలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. దీనికి ఓ నెటిజన్ , ఇలాంటి పోస్ట్‌లు పెట్టే ముందు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం, చాలా మంది మృత్యువాత పడడం గురించి ఏమి ఆలోచించడం లేదా, ఇలాంటి పోస్ట్‌లు ఈ టైంలో అవసరమా అంటూ కామెంట్ పెట్టాడు.
 
నెటిజన్ పోస్ట్‌కు బదులిచ్చిన అనసూయ..ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా మేము కొంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ కామెంట్ పెట్టింది. దీనికి తిరిగి బదులిచ్చిన నెటిజన్.. ఈ టైంలో జనాలు కోరుకునేది సపోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు అని అన్నాడు. ఇద్దరి మధ్య వాడి వేడిగా జరిగిన డిస్కషన్ హాట్ టాపిక్‌గా మారింది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు