దిల్ రాజు రెండో పెళ్లి: 30 ఏళ్ల అవివాహితను పెళ్లాడబోతున్నారా?

గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:16 IST)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సతీమణి అనిత 2017లో గుండెపోటుతో హఠన్మరణం చెందారు. దీనితో దిల్ రాజు చాలా రోజులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత సినిమా నిర్మాణంలో ఫుల్ బిజీ అయిపోతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
 
ఇటీవలే ఆయన సమంత ప్రధానపాత్రలో జాను చిత్రాన్ని నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో వున్నాయి. ఇలా... దిల్ రాజు జీవితం పూర్తిగా సినిమా నిర్మాణంలో మునిగిపోయి వుంది. ఏదైనా కాస్త తీరిక దొరికితే తన కుమార్తె ఇంటికి వెళ్లి మనవరాలితో ఆటలాడుతూ వుంటారు. 
 
ఐతే.. కొన్నిసార్లు భార్య లేని లోటు, వంటరి యానం ఇబ్బందికి గురిచేస్తుంది. దిల్ రాజు జీవితంలో అలాంటి స్థితిని చూసిన ఆయన సన్నిహితులు రెండో పెళ్లి చేసుకుంటే జీవితంలో వున్న లోటు కాస్తయినా భర్తీ అవుతుందని సూచనలు చేస్తున్నారట. 49 ఏళ్లు నిండినా యువకుడిలా చలాకీగా వుండే ఆయన్ని చూస్తే చాలు.. సర్ పెళ్లి చేసుకోండి.... అంటూ సలహా ఇస్తున్నారట. దిల్ రాజు కూడా దీనిపై ఆలోచన చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ జనం టాక్.
 
మరోవైపు దిల్ రాజు ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన 30 ఏళ్ల అవివాహిత యువతిని పెళ్లాడబోతున్నారనీ, ఆమె సినీ ఇండస్ట్రీకి చెందినవారు కాదని సమాచారం. దిల్ రాజు కుటుంబానికి ఆ యువతి ఫ్యామిలీ గత కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. సదరు యువతి కూడా దిల్ రాజును వివాహం చేసుకునేందుకు సమ్మతించడంతో ఇక పెళ్లే తరువాయి అంటూ టాలీవుడ్ సినీజనం చెప్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు