ఈ మధ్యకాలంలో కిస్ ఆఫ్ లవ్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అనేక నగరాల్లో ఈ తరహా కార్యక్రమం చేపట్టేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకునే కార్యక్రమం నిర్వహణ కోసం తమకు అనుమతి ఇవ్వాలంటూ వారు ఆయన ప్రాంతాల పోలీసులకు విజ్ఞప్తులు చేయడం, వారు నిరాకరించడం, ఈ విషయంపై ధర్నాలు చేయడం పరిపాటిగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు హీరోయిన్లు కిస్ ఆఫ్ లవ్లో పాల్గొన్నారు. వారు ఎవరో కాదు. కాజల్ అగర్వాల్, అమలా పాల్. ఇటీవల జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరిద్దరు బహిరంగంగా ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు.