కీర్తి సురేష్. వెండితెరకు పరిచయమైన మలయాళ కుట్టి. ఈ భామ మాంచి రైజింగ్లో ఉంది. దీంతో ఇటు టాలీవుడ్తో పాటు అటు కోలీవుడ్కు చెందిన స్టార్ హీరోలు ఆమె వెంట పడుతున్నారు. లిమిట్ లేకుండా గ్లామరస్గా నటించేందుకు తాను సిద్ధమని ఈ భామ ప్రకటించింది. దీంతో హీరోలు ఆమెతో కలిసి నటించేందుకు క్యూ కడుతున్నారు. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి.
తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా వరుసగా క్రేజ్ వున్న హీరొలతో హీరోయిన్గా చేసే అవకాశాన్ని ఈ మలయాళ కుట్టి కొట్టేసింది. ఇక.. తమిళంలో కూడా కీర్తి హవా సాగుతోంది. అక్కడ కూడా టాప్ హీరోలతో జత కడుతోంది. విజయ్తో 'భైరవ' ఫినిష్ చేసిన తర్వాత స్టార్ బ్రదర్స్ సూర్య.. కార్తిలను లైన్లో పెట్టింది.
ఇప్పటికే "సింగం 3" తర్వాత సూర్య చేయబోయే మూవీలో హీరోయిన్గా ఆఫర్ పట్టేసింది. ఇక తమ్ముడు కార్తితో కూడా త్వరలో హీరోయిన్గా చేయబోతోంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్న మూవీ తర్వాత కార్తి చేయబోయే మూవీకి కీర్తిని ఫైనల్ చేశారని టాక్. ఇలా వరుస ఆఫర్లతో.. గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్తో దూసుకుపోతోందీ భామ.