మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. అయినా ఆమె జోష్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు పోస్టు చేస్తున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లో పెళ్లైనా సరే స్టార్ హీరోయిన్గా నటించేందుకు సిద్ధం అవుతోంది. కీర్తి బాలీవుడ్ అరంగేట్రం బేబీ జాన్ (2024) బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినప్పటికీ, ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమ నుండి అధిక ప్రొఫైల్ ఆఫర్లు వస్తున్నాయి.
రణ్బీర్ విషయానికొస్తే, అతని చివరి బ్లాక్బస్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్. రష్మిక మందన్నతో కలిసి నటించిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఇంకా రామాయణం సినిమాలోనూ, సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.