డైరెక్టర్ తేజకు ఝులక్ ఇచ్చిన ఉప్పెన హీరోయిన్

బుధవారం, 12 మే 2021 (19:34 IST)
"ఉప్పెన" చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి కృతిశెట్టి. ఈ ఒక్క చిత్రంతో ఈ అమ్మడు దశ రాత్రికి రాత్రే మారిపోయింది. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి కృతిశెట్టి ప్రస్తుతం ఓ స్టార్ డైరెక్టర్‌కు నో చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరోయిన్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. చేతిలో అరడజను సినిమాలున్నాయని సమాచారం. నానితో "శ్యామ్ సింగ రాయ్", సుధీర్ బాబు, రామ్ పోతినేనిలతో ఒక్కో సినిమాలు చేతిలో ఉన్నాయి. 
 
మరో మూడు సినిమాలు కూడా సైన్ చేసిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు హీరోయిన్‌గా కృతి శెట్టిని సంప్రదించగా నో చెప్పిందట. తేజ సినిమాలలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి దర్శకుడికి ఎందుకు నో చెప్పిందనే విషయం తెలియాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు