‘జనతా గ్యారేజ్’ షూటింగ్తో బిజీగా ఉన్నకొరటాల శివ తన తరువాతి ప్రాజెక్టును రామ్ చరణ్తో పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడు. మరోవైపు కొరటాలతో సినిమా చేయడానికి రామ్ చరణ్ మరింత ఉత్సాహం చూపించాడు. అయితే, ‘జనతా’ పూర్తయిన వెంటనే తన ప్రాజెక్టును ప్రారంభించాలనుకుంటున్న కొరటాలకు చరణ్ అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ఈ అవకాశాన్ని మహేశ్ దక్కించుకున్నాడు.
దీనికి సంబంధించి నిర్మాత డీవీవీ దానయ్య, మహేశ్ సమావేశం అయినట్లు, మహేశ్కు రెమ్యునరేషన్గా రూ.18కోట్లు చెల్లించనున్నట్లు తెలిసింది. మురుగదాస్తో సినిమా చేస్తూనే ఈ సినిమా కూడా చేయాలని, దీంతో వచ్చే ఏడాది వెంటవెంటనే రెండు సినిమాలు విడుదల చేయాలనేది మహేశ్ ప్లాన్గా ఫిలింనగర్లో చెప్పుకుంటున్నారు.