'బ్రహ్మోత్సవం' సినిమా తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'అభిమన్యు'. ప్రస్తుతం జెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేస్తోన్న మహేష్, తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది.
భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఓ ఫైట్ సీన్ను భారీగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే ఓ ఫైట్ సన్నివేశాన్ని దాదాపు 3 కోట్ల రూపాయిలతో తెరకెక్కిస్తున్నారట. ఈ సీన్లో భారీ కార్ చేజ్, బోట్ చేజ్తో పాటు కొంత యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది.
హాలీవుడ్ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో… హాలీవుడ్ యాక్షన్ సీక్వెల్స్కు ధీటుగా ఈ సీన్ ఉండేలా దర్శకుడు మురుగదాస్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సీన్ చూస్తున్న ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ అవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు చెపుతున్నాయి. ఈ చిత్రంలో మహేష్బాబు సరసన రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.