అందువల్ల ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదు. కేబినెట్ సమావేశం తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ చేపట్టిన ఏ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న 3వేల టీఎంసీలను మాత్రమే ఏపీ వాడుకుంటుందని తెలిపారు.
వరద జలాలను తెలంగాణ కూడా వాడుకోవచ్చని తమకు అభ్యంతరం లేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అందరు నాయకులు పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. అది తెలంగాణ ప్రయోజనాలకు హానికరం కాదని వారికి, ప్రజలకు స్పష్టం చేయాలి.
కొంతమంది తెలంగాణ నాయకులు ఈ ప్రాజెక్టుపై సందేహాలను లేవనెత్తుతున్నారని, ఈ అంశాన్ని రాజకీయం చేయడానికే ఈ ప్రాజెక్టుపై చర్చించారని మండిపడ్డారు. మొదటి దశలో అమలు చేసిన నియమాలను రెండవ దశలో కూడా అమలు చేయాలని చంద్రబాబు అన్నారు.