సాయిపల్లవితో సినిమా చేస్తూనే అనుపమతో నాని రొమాన్స్...

బుధవారం, 25 అక్టోబరు 2017 (18:03 IST)
కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ''ఎంసీఏ'' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమా షూటింగ్‌ను కూడా కానిచ్చేస్తున్నాడు. 
 
ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా కిషోర్ తిరుమలనే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ ప్రాజెక్టుకు నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు