సుశీల్ కుమార్ షిండే. రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కేంద్ర హోంశాఖామంత్రిగా, ఏపీ గవర్నర్గా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నేత. ప్రస్తుతం ఈయన పేరు కంటే ఈయనగారి మనువడు శిఖర్ పహారియా పేరు బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటో ఇప్పటికే అర్థమైవుంటుంది.
నిజానికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం నిత్యం వార్తల్లో ఉండాలంటే ఏదో ఒక సంచలనం చేస్తూ ఉండాలి. కానీ, ఈ కుర్రోడు మాత్రం అలాంటిదేం లేకుండానే మంచి పబ్లిసిటీ కొట్టేస్తున్నాడు. తాజాగా తాకిన లిప్ మళ్లీ తాకకూడదనుకున్నాడో ఏమో గానీ కొత్తగా ట్రై చేశాడు.
ఇటీవల శ్రీదేవి కుమార్తె జాహ్నవితో అత్యంత సన్నిహితంగా మెలగడమే కాక, ఆమె లిప్ లాక్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు అమితాబ్ మనువరాలితో ఉన్న ఫొటోలు కూడా నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటో చూస్తే ఇతగాడు నందాతో డేటింగ్ చేస్తున్నాడా? అనే అనుమానాలు కలగక మానవు.