పవన్ మరో ప్రాజెక్టు ఓకే.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్

ఆదివారం, 20 డిశెంబరు 2020 (14:31 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇప్పటికే "వకీల్ సాబ్" చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ మరికొన్ని ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి వాటిలో మలయాళ మూవీ "అయ్యప్పనుమ్ కోశియుమ్" చిత్రం. 
 
ఇందులో చివ‌రిగా ప్ర‌క‌టించిన 'అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌' సినిమాను ముందుగా ప‌వ‌న్ సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్లు టాక్‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సోమ‌వారం(డిసెంబ‌ర్ 21)న సినిమాను లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ట‌. జ‌న‌వ‌రి మొద‌టి వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంద‌ని అంటున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొంద‌నుంది. 
 
నిజానికి ఈ చిత్రం కంటే ముందుగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితంకానున్న చిత్రం, సురేందర్ రెడ్డి - రామ్ తాళ్లూరి చిత్రాలు ప్రారంభంకావాల్సివుంది. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ముందుగా అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని తెరపైకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు