రామ్ చరణ్ లిబరల్గా వుంటాడని అంటారు. సెట్లో సరదాగా వుండే తను బయట కూడా ఒక్కో సందర్భంలో ఒక్కోలా వుంటాడు. అయితే ఇటీవలే ఓ విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. చరణ్ తన ఇమేజ్ మేకోవర్లో సీరియస్ అయ్యాడట. ఇందుకు కారణం.. తాను ఎవ్వరితో పెద్దగా కలవననీ.. వచ్చిన వార్తల్లో తన ఇమేజ్ దెబ్బతిన్నదనే భావన రావడంతో అందుకు కారణమైన వారిపై సీరియస్ అయినట్లు సమాచారం.
దీనికి కారణం.. తను నిర్మిస్తున్న ఖైదీ నెం.150 సినిమాలో లక్ష్మీరాయ్ నటిస్తోంది. ఐటం సాంగ్ చేసినందుకు ఆమెకు రూ.40 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయం బయటకు వచ్చింది. అందుకు కారణమైన మేనేజనర్ను నిలదీయడంతో నీళ్లు నమలాడట అతను. వెంటనే అతన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. సహజంగా ప్రముఖ వ్యక్తుల చుట్టూ వున్నవారే ఇలాంటి లీకులు చేయడం.. అవి బయటపడటం జరుగుతుంటుంది.