ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చరణ్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఆ అనందంలో ఉండగానే మరో బంపర్ ఆఫర్ రాశీకి దక్కినట్టు సమాచారమ్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్స్ని ఎంపిక చేసే పనిలో పడింది చిత్రబృందం.
తాజాగా, ఓ హీరోయిన్గా రాశీఖన్నాని తీసుకొన్నట్టు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది త్వరలోనే తేలనుంది. ఈ చిత్రం ఫిబ్రవర్ 11న ప్రారంభం కానుంది. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్కి వెళ్లనున్నారు. జెడ్ స్వీడుతో సినిమాని పూర్తి చేసి ఆగస్టు 11న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రసాద్. కళ్యాణ్ రామ్ నిర్మాత.