రెజీనాపై ఇప్పటిదాకా మెగా హీరోతో లింకు పెట్టి రూమర్స్ వచ్చేవి. ఎస్సెమ్మెస్ సినిమా ద్వారా తెరపైకి వచ్చిన రెజీనా.. అగ్ర హీరోయిన్గా ఎదిగింది. చురుగ్గా వుండే ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేయాలన్న ప్లాన్తో ఉందట. నాలుగు సినిమాల్లో నటిస్తూ పోస్టర్లలో కనిపిస్తున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడిందట.
ఇదిలా ఉంటే.. గోవిందుడు అందరివాడేలే సినిమాకు తర్వాత కృష్ణ వంశీ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. నక్షత్రం అనే పేరిట ఈ సినిమా తెరకెక్కుకోంది. ఈ సినిమాలో రెజీనా గెటపే ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో రెజీనా జూనియర్ ఆర్టిస్టు రోల్ పోషిస్తున్నట్లు తెలిసింది. జమునారాణి అనే ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ అంటోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్కు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది.