ప‌వ‌న్ సినిమా నుంచి త‌ప్పుకున్న సాయిప‌ల్ల‌వి? కారణం ఏంటి?

మంగళవారం, 2 మార్చి 2021 (17:30 IST)
Sai pallavi
ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో న‌టించేందుకు చాలా మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కానీ వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌ద్ద‌నుకున్న న‌టి సాయిప‌ల్ల‌వి. వివ‌రాల్లోకి వెళితే, సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక చిత్రం చేస్తున్నారన్నది తెలిసిందే.

మలయాళ చిత్రం `అయ్యపనమ్ కోషియం` చిత్రానికి రీమేక్‌. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ప‌వ‌న్ జాబితాలో ఈ సినిమా కూడా ముందుంది. సెట్‌పైకి వెళ్ళేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా హీరోయిన్‌గా సాయి పల్లవి న‌టించ‌నున్న‌ద‌ని వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దానితో ఆమె సినిమాకు సంత‌కం కూడా చేసిన‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఆమె సినిమా నుంచి త‌ప్ప‌కుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌రో న‌టి కోసం వేట మొద‌లు పెట్టింది చిత్ర బృందం. ఇప్ప‌టికే యూత్ హీరోల‌తో చేసిన ఆమె సీనియ‌ర్ హీరోల‌తో చేయ‌డం మొద‌టి అవ‌కాశంగా భావించింది.

పెద్ద హీరో సినిమాకు మంచి కెరీర్ వుంటుంద‌నుకున్న స‌మ‌యంలో కొన్ని కార‌ణాల‌ వ‌ల్ల సాయి ప‌ల్ల‌వి త‌ప్పుకుంద‌ని వార్త వినిపిస్తోంది. కార‌ణాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి. కాగా, ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం`, ల‌వ్‌స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాల్లో న‌టిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు