సల్మాన్ ఖాన్ సరసన రష్మిక, సమంత... ఏకంగా పది మంది హీరోయిన్లతో..?

బుధవారం, 22 జూన్ 2022 (21:11 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన రష్మిక, సమంత కలిసి నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
తాజాగా సల్మాన్ ఖాన్ హిందీలో సూపర్ హిట్టయిన "నో ఎంట్రీ" అనే సినిమాకి సీక్వెల్ చేయడానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సౌత్ ఇండస్ట్రీ నుంచి పేరున్న హీరోయిన్‌లను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 
 
ఇప్పటికే చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్న సల్మాన్ ఖాన్ టాలీవుడ్‌లో కూడా తన క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే తన సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో తమన్నా కూడా ఒక ఐటెం సాంగ్‌లో కనిపించబోతోందని, ఈ సినిమాలో దాదాపుగా పది మంది హీరోయిన్లు ఉండబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు