ఖుషి కపూర్‌తో దర్శకేంద్రుడి 'పెళ్లిసందD'

సోమవారం, 30 నవంబరు 2020 (11:12 IST)
టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో "పెళ్ళిసందడి" ఒకటి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇపుడు ఈ చిత్రానికి శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో "పెళ్ళిసందD" పేరుతో రీమేక్ చేస్తున్నారు. దర్శకేంద్రుడి పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తుండగా, ఆక్రా మీడియా వర్క్స్ సమర్పణలో కె.కృష్ణమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అయితే, ఇటీవలే ఈ చిత్రం టైటిల్‍‌ లోగోను రిలీజ్ చేశారు. కానీ, ఇపుడు ఓ వార్త ఫిల్మ్ నగరులో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని అలనాటి అందాల నటి, వెండితెర 'అతిలోకసుందరి' దివంగత శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. అలాగే, మ‌రో హీరోయిన్‌గా మల‌యాళ బ్యూటీ మాళ‌విక నాయ‌ర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, దీనిపై క్లారిటీ రావాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు