అజిత్ సరసన తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

బుధవారం, 11 అక్టోబరు 2023 (15:23 IST)
అతిపెద్ద తమిళ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ సరసన టాలీవుడ్ హీరోయిన్ నటించనుంది. అజిత్ ఇటీవలి చిత్రం "తెగింపు" అతని కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విడా ముయర్చిలో అజిత్ నటిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సీనియర్ స్టార్ అయిన త్రిష ఇందులో హీరోయిన్. అజిత్ కుమార్- త్రిష కృష్ణన్ నటించిన ఈ రాబోయే డ్రామా విడా ముయార్చిలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా కనిపించనుంది. అయితే ఆమె మరో కథానాయికగా నటిస్తుందా లేక ఏదైనా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు