ఆమెకు నాకు అలాంటి సంబంధం లేదు : నటుడు నరేష్

శుక్రవారం, 1 జులై 2022 (07:22 IST)
దక్షిణాది చిత్రసీమకు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని, తమ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహ సంబంధమేనని సీనియర్ నేటు నరేష్ స్పష్టం చేశారు. 
 
పవిత్ర లోకేశ్‌ను నరేష్ రెండో వివాహం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిపై నరేష్ వివరణ ఇచ్చారు. పవిత్రకు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని స్పష్టం చేశారు. హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగులో ఆమె తనకు పరిచయమైందన్నారు. అప్పటి నుంచి గత ఐదేళ్లుగా తమ మధ్య పరిచయం ఉందని చెప్పారు. పైగా, తాను కూడా మనిషేని, మగాడ్ని అని తనకు భావోద్వేగపరమైన మద్దతు అవసరం అని నరేశ్ పేర్కొన్నారు. 
 
అయితే, 'సమ్మోహనం' చిత్రంలో తమ ఇద్దరి మధ్య స్నేహం మరింతగా బలపడిందన్నారు. పైగా ఇరువురి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని తెలుసుకున్నట్టు చెప్పారు. కానీ, రమ్య (మూడో భార్య) వచ్చి రచ్చ చేస్తోందన్నారు. పవిత్రను లక్ష్యంగా చేసుకుని తనపై కక్ష సాధిచాలని భావిస్తుందని ఆయన ఆరోపించారు. రమ్య మానసిక పరిస్థితి బాగోలేదని వైద్యులు ఏనాడో చెప్పారని గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు