నా వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా: శ్వేతాబసు ప్రసాద్

మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:36 IST)
'కొత్త బంగారు లోకం' చిత్రంతో పాపులరైన శ్వేతాబసు ప్రసాద్ తన ఏడాది వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తన ఇన్ స్టాగ్రాం ద్వారా తెలియజేసింది. 2018 డిసెంబర్‌ 13న శ్వేతా బసు తన స్నేహితుడు రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద సహ దర్శకుడుగా పనిచేస్తున్న సమయంలో అతడి ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లాడటం జరిగింది. ఐతే అతడితో తన జర్నీ సాధ్యం కానందున విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపింది.
 
రోహిత్‌‌, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. పెళ్లయిన తర్వాత కొన్ని నెలలుగా బాగానే వున్నా ఆ తర్వాత తమ మధ్య విభేదాలు వచ్చాయనీ, అందువల్ల ఇక తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అలాగే తను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలను రోహిత్ తనకు ఇచ్చారనీ, ఇందుకుగాను ఆయనకు థ్యాంక్యూ అని పోస్ట్ చేసింది.
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు