గిరిజన యువతిగా చాలా కష్టాలు పడ్డాను.. 'మౌనపోరాటం' అలా ఛాన్స్ వచ్చింది.. యమున

ఠాగూర్

గురువారం, 14 మార్చి 2024 (12:18 IST)
గిరిజన యువతిగా చాలా కష్టాలు పడ్డానని హీరోయిన్ యమున అంటున్నారు. అలాగే, "మౌనపోరాటం" చిత్రంలో అవకాశం యాదృచ్ఛికంగానే వచ్చిందన్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. 'మౌనపోరాటం' చిత్రంలోని పాత్ర కోసం చాలా మందిని టెస్ట్ చేశారు. కానీ, తనతోనే ఆ పాత్రను చేయించాలని నిర్మాత రామోజీరావుగారు చెప్పారన్నారు. 
 
ఈ సినిమా షూటింగును అరకు సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారని తెలిపారు. ఈ సినిమాలో తాను గిరిజన యువతిగా నటించినట్టు చెప్పారు. ఇందుకోసం కాళ్లకు చెప్పులు కూడా ఉండవన్నారు. అలా చెప్పులు లేకుండానే ఒక షాట్‌‍లో దర్శకుడు తనను పెరుగెత్తించారన్నారు. అక్కడ విపరీతమైన ముళ్లు, ముళ్ల పొదలు ఉండేవన్నారు. పాదాల్లో ముళ్లు దిగినప్పటికీ ఒళ్లంతా ముగ్గు గీసుకునిపోయి రక్తం వచ్చేదన్నారు. 
 
ఇప్పటికే తనకు ఆ సన్నివేశం గుర్తుకు వస్తూనే ఉంటుందన్నారు. అంతగా ఆ సినిమా కోసం పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. ఈ పాత్రను ఈ అమ్మాయి మాత్రమే చేయగలదు అని మంచి పేరు వచ్చిందన్నారు. ఇక ఆ తర్వాత కాలంలో తాను బంగారు కుటుంబం షూటింగులో ఉండగా, వర్మగారు అలా వెళుతూ తనను చూశారని, ఆ మరుసటిరోజే గోవిందా గోవిందా చిత్రంలో లక్ష్మీదేవి పాత్రను ఇచ్చారని, ఆ సంఘటన ఎన్నటికీ మరిచిపోలేనని యమున చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు