భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్గా బంధీ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోంది.. భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ మధ్య బంధీ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్ను ఈ చిత్రంలో చూడబోతోన్నాం. పర్యావరణ ప్రేమికులందరినీ కదిలించేలా ఈ చిత్రం ఉండనుంది.
ఈ మూవీ కోసం మేకర్లు ఓ వ్యూహాన్ని రచించారు. ముందుగా ఈ చిత్రాన్ని కొన్ని పరిమిత స్క్రీన్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ తరువాత ప్రేక్షకుల రెస్పాన్స్ను బట్టి.. స్క్రీన్లు, షోలు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించకున్నారు. నిర్మాతలు వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం NGOలు, సామాజిక సంస్థలతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్లకు మంచి ఆదరణ లభించడంతో సినిమా విడుదలపై మరింత ఉత్కంఠ నెలకొంది. బంధీ చిత్రాన్ని ఫిబ్రవరి 28న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్లు సిద్దంగా ఉన్నారు.