అనేక వివాదాల నడుమ వెండితెరపై ప్రదర్శితమైన చిత్రం ‘యే దిల్ హై ముష్కిల్’. ఈ చిత్రం విడుదలకు ముందు ప్రచారంలో బ్లాక్బస్టర్గా నిలిస్తే.. చిత్రం విడుదలైన తర్వాత సూపర్ డూపర్ హిట్ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత శుక్రవారం విడదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లక్లబ్లో చేరిపోయింది.
యురీ ఘటన నేపథ్యంలో పాక్ నటులు భారత్ వదిలి వెళ్లిపోవాలని, వారి సినిమాలను భారత్లో విడుదల చేయనివ్వమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన హెచ్చరించింది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల విషయమై దర్శక-నిర్మాత కరణ్ జోహార్.. నిర్మాతల బృందం హోంమంత్రి రాజ్నాథ్తో పాటు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రేలతో కలిసిచర్చించిన విషయం తెల్సిందే. ఆ తర్వాతే ఈ చిత్రం విడుదలకు నోచుకుంది.