అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా.. పూరీ జగన్నాథ్‌ డైరక్షన్

శనివారం, 19 నవంబరు 2016 (16:45 IST)
తెలుగు తెరపై త్వరలో సూపర్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని టాక్ వస్తోంది. ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారని టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందట. ఇప్పటికే సాయిధరమ్‌, కల్యాణ్‌ రామ్‌ కలయికలో ఓ మల్టీస్టారర్‌ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. 
 
మరోవైపు అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో త్వరలో సూపర్ హిట్ సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్‌ హీరోల కలయిక వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కథను ఎన్టీయార్‌, బన్నీకి వినిపించాడని టాక్ వస్తోంది. ఈ కథ ఇద్దరు హీరోలకు బాగా నచ్చడంతో బన్నీ, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి