గీతా ఆర్ట్స్ ఆఫీసులో వినాయ‌కుడికి వీడ్కోలు ప‌లికిన అల్లు అర్జున్‌

సోమవారం, 5 సెప్టెంబరు 2022 (17:18 IST)
Allu Arjun, allu arha
వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా గీతా ఆర్ట్స్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వ‌రుడికి ఈరోజు నిమ‌జ్జ‌నం చేస్తున్నారు. మ‌ధ్యాహ్నం 2గంట‌ల త‌ర్వాత కార్యాల‌యానికి అల్లు అర్జున్ రావ‌డంతో సంద‌డి నెల‌కొంది. డ‌బ్బులు వాయిద్యాల‌తోపాటు అభిమానులు గంతులు వేస్తూ బోలో గ‌ణేష్ మారాజ్‌కూ అంటూ నినాదాలు చేస్తూ సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా తుదిసారి వినాయ‌కుడికి కొబ్బ‌రికాయ‌లు కొట్టి స్వామినీ సాగ‌న‌పించారు.
 
Allu Arjun, allu arha
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌ సిబ్బందితో కలిసి గణేష్‌కి వీడ్కోలు పలుకుతున్నప్పుడు వేడుకల మూడ్‌లో ఉన్నారు. నిమజ్జన ఊరేగింపును కిక్‌స్టార్ట్ చేయడానికి నటుడు తన కుమార్తె  అల్లుఅర్హతో కలిసి కొబ్బరికాయ పగలగొట్టాడు. ఉత్సవాల్లో మరింత పాల్గొనేలా అర్హను ప్రోత్సహించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు