మహేష్‌బాబుపై మనసు పారేసుకున్న 106 యేళ్ళ మహిళ

సోమవారం, 26 నవంబరు 2018 (13:15 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుబై 106 యేళ్ళ మహిళ ఒకరు మనసు పారేసుకున్నారు. ఆమె అభిమానానికి ముగ్ధుడైన మహేష్... ఆమెతో కలిసి ఫోటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి అనే వృద్ధురాలు ప్రిన్స్ మహేష్ బాబు వీరాభిమానుల్లో ఒకరు. తన హీరోను చూడాలని ఆ భామ పరితపిస్తూ వచ్చేది. ఇందుకోసం ఆమె రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఆమెను కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశాడు.
 
"యేళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తోంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు