తెలుగు యాంకర్ అనసూయను ఓ క్లాతింగ్ వెబ్సైట్ మోసం చేసింది. ఆన్లైన్ ఆర్డర్ చేసిన వస్తువులు పంపించకుండా తనను మోసం చేశారంటూ ఆమె సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ముందే చెల్లించినా తాను ఆర్డర్ వేసిన దుస్తులను ఇప్పటివరకూ పంపలేదని మండిపడ్డారు. ఈ మేరకు అనసూయ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్గా మారింది.
దాదాపు నెలరోజుల క్రితం ట్రపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్సైట్లో కొన్ని దుస్తులకు అనసూయ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టింది. ఆ దుస్తులను సంబంధించిన మొత్తాన్ని ముందే చెల్లించింది. అయితే, నెల రోజులు గడిచినా తన ఆర్డర్ పెట్టిన దుస్తులు రాలేదని, ఈ విషయంపై సదరు వెబ్సైట్ నిర్వాహకులను సంప్రదించినా స్పందన లేదని ఆరోపించింది. అటు ఆర్డర్ పెట్టిన దుస్తులు పంపించకుండా, ఇటు డబ్బులు తిరిగి చెల్లించకుండా డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి డబ్బులు కాజేస్తున్నారని ట్రిపుల్ ఇండియా వెబ్ సైట్ నిర్వహకులపైమండిపడింది. ఈ విషయంపై తాను స్పదించకూడదని అనుకున్నానని, కానీ, మిగతా వారు తనలాగా మోసపోవద్దని చెప్పేందుకే ఈ పోస్ట్ చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.