34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

ఠాగూర్

బుధవారం, 4 జూన్ 2025 (11:56 IST)
బాలీవుడ్ నటి ప్రీతి జింటా 34 మంది పిల్లలకు తల్లిగా మారారు. తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టకముందే ఆమె తల్లిగా మారడం గమనార్హం. సినిమాల్లో బిజీగా సమయంలోనే ఆమె అమెరికా పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్న ఆమె... లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడిన విషయం తెల్సిందే. అయితే, అంతకుముందే ఆమె ఏకంగా 34 మంది ఆడపిల్లలకు తల్లి అయ్యారు. వారి చదువు, ఆహారం, దుస్తులు వంటి అన్ని అవసరాలను తానే చూసుకుంటున్నట్టు ప్రీతి గతంలో వెల్లడించారు. 
 
నేను 34 మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నాను. వారి చదువు, ఆహారం, దుస్తుల వరకు అన్నీ నేనే చూసుకుంటున్నాను. ఆ పిల్లలందరి ఉత్సాహభరితమైన మాటలు వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలియదు. వారంతా ఇప్పుడు నా పిల్లలు. నా బాధ్యత. వారితో నిరంతరం టచ్‌‌లో ఉంటున్నాను. యేడాదికి రెండుసార్లు వారిని కలుస్తాను అని ప్రీతి జంటా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు