బిగ్ బాస్ నాలుగో సీజన్.. సీక్రెట్లు తెలిసిపోతున్నాయ్‌గా..

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:15 IST)
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవట్లేదు. బలమైన కంటెస్టెంట్స్‌ లేకపోవడం, కంటెస్టెంట్స్‌ మధ్య గ్లేమ్‌ ప్లానింగ్‌ సరిగా లేకపోవడం అని చెప్తూ వచ్చిన ఆడియెన్స్‌ మరో కారణంగానూ బిగ్‌బాస్‌-4పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందంటున్నారు. అదేంటంటే బిగ్‌బాస్‌ షోలో సీక్రెసీ లేకపోవడమేనట. ఇంతకూ బిగ్‌బాస్ ఏ విషయంలో సీక్రెట్‌ మెయిన్‌టెయిన్‌ చేయలేకపోతున్నారంటే.. ఎలిమినేటర్స్‌ విషయంలోనని అంటున్నారు బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌. 
 
గత సీజన్స్‌లోనూ కొన్ని ఎలిమినేటర్స్‌ విషయం లీకులైయాయి. కానీ అవి కొన్ని గంటల ముందే తెలిసేవి. కానీ నాలుగో సీజన్‌లో ఎలిమినేటర్‌ ఎవరనే విషయం రెండు రోజుల ముందే తెలిసిపోతుంది. ఇప్పటి వరకు బిగ్‌బాస్‌-4లో సూర్యకిరణ్‌, కళ్యాణి, దేవీ నాగవల్లీ ఎలిమినేషన్స్‌ జరిగాయి. అయితే ఆదివారం జరిగే ఈ ఎలిమినేషన్స్‌ గురించి శుక్రవారం రోజునే న్యూస్‌ లీకవుతుంది. రెండు రోజుల ముందు విషయం బయటకు పొక్కుతుండటంతో.. కిక్‌ లేకుండా పోతుందని టీవీ ఆడియెన్స్‌ భావిస్తున్నారట.  
 
ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ అంతా ఊహించినట్టే జరగగా, మూడో వారంకు సంబంధించి హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ విషయంలో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఎలిమినేటర్ పేరు ప్రకటించడంతో హౌజ్‌మేట్స్‌తో పాటు టీవీ చూసే ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
 
మూడో వారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు ఇంటి సభ్యులు లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలలో శనివారం రోజు లాస్య, మోనాల్ సేవ్ అయినట్టు ప్రకటించారు నాగ్. ఇక ఆదివారం రోజు డ్యాన్స్ చేపిస్తూ మెహబూబ్, హారిక, అరియానాలని సేవ్ అయినట్టు తెలిపారు నాగార్జున. ఇక చివరికి ఎలిమినేషన్‌లో కుమార్ సాయి, దేవి ఉన్నారు. వీరిలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు వెళ్ళిపోతారు తెలుసుకునేందుకు రెండు బాక్స్‌లు తెప్పించి అందులో చేయి పెట్టమని అన్నారు నాగార్జున. 
 
ఎవరి చేతికి ఎరుపు రంగు ఉంటే వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. దేవి చేతికి ఎరుపు రంగు అంటడంతో ఆమెని ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు కింగ్ నాగ్. దీంతో హౌజ్ మొత్తం షాక్ అయింది. అరియానా అయితే వెక్కి వెక్కి ఏడ్చింది. ''నేను ఎలిమినేట్ అయినా ఇంత బాధపడేదాన్ని కాదక్కా'' అంటూ దేవిని పట్టుకుని తెగ ఏడ్చేసింది అరియానా. మిగతా వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. చివరకు దేవికి ధైర్యం చెప్పి పంపారు. స్టేజ్ మీదికి వచ్చిన దేవి నాగవల్లిని ఎలిమినేట్ అవడానికి కారణం ఏమై ఉంటుందని నాగార్జున అడగ్గా.. నాకు తెలియదు సార్ అని దుఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది దేవి.
 
ఎంతో బాధతో ఉన్న దేవిని చూసి నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ఆమెను ఎప్పుడు ఇలా చూడలేదని పేర్కొన్నాడు. ఇంటి సభ్యులకు పలు సూచనలు చేసిన తర్వాత దేవి 'నువ్వుంటే నా జతగా' అంటూ ఎమోషనల్ సాంగ్ పాడి అందరిని ఏడిపించారు. చివరకు ఒక హౌజ్‌మేట్‌ను సేవ్ చేసే బిగ్ బాంబ్ ఎవరిపై వేస్తావు నాగార్జున అడగగా, ఆ ఛాన్స్ అరియానాకు ఇచ్చింది. దీంతో ఆదివారం ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడింది. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అందరి మైండ్స్ బ్లాక్ అయ్యేలా చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు