అయితే, హైదరాబాద్ వాతావరణంపై కంగనా ప్రత్యేకంగా స్పందించారు. హైదరాబాద్ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉందని కితాబిచ్చారు. హిమాలయాల్లో కరిగిన శరద్ ఋతువు ఇక్కడ శీతాకాలంగా మారిందా అన్నట్టుగా ఉందని అభివర్ణించారు.
ఇకపోతే, ఇటీవల హాలీవుడ్ నటి సల్మాహయెక్ ఓ సంచలన ప్రకటన చేసింది. తాను హిందూ దేవత లక్ష్మీదేవిని ధ్యానిస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భక్తి గురించి ఆమె మాట్లాడారు.
మతం, జాతి అనే తేడా లేకుండా చాలా మంది రాముడిని ప్రేమిస్తారని తెలిపింది. ఎంతోమంది భగవద్గీతను అనుసరిస్తారని చెప్పారు. కానీ, మన దేశంలో మాత్రం కొంత మంది భక్తిని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది.