శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (18:31 IST)
ముంబై పోర్న్ గ్రఫీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఫోను గ్రాఫిక్స్ కేసులో కీలక నిందితుడు అయిన… బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూరు అయింది.

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజుకు ఆంధ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ముంబై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 50 వేల రూపాయల పూచికత్తు తో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది ముంబై కోర్టు. అంతేకాదు నిందితుడు రాజ్ కుంద్రా కు బెయిల్ ఇస్తూనే కొన్ని షరతులు పెట్టింది ముంబై కోర్టు.
 
బెయిల్పై విడుదల అయిన అనంతరం… ముంబై దాటి.. ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఒక వేళ కోర్టు నిబంధనలను.. దిక్కరిస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని నొక్కిచెప్పింది ముంబై కోర్టు. కాగా అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జులై మాసంలో ముంబై పోలీసులు అరెస్టు చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు