గత కొద్దిరోజులుగా సినీ కార్మికులు తమకు 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతూ రకరకాలుగా పోరాటాలు చేశారు. దానికి ట్రేడ్ యూనియన్ నాయకులతోపాటు రాజకీయపార్టీలు కూడా కార్మికుల కోసం పోరాడుతూ ముందుకు వచ్చారు. లేబర్ కమీషనర్, తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి కోమటిరెడ్డి ని కూడా కలవడం జరిగింది. అయితే ఎక్కడా అటు కార్మికులుకానీ, యూనియన్ నాయకులుకానీ, నిర్మాతలు కానీ మెట్టు దిగలేదు. ఫిలింఛాంబర్ కూడా గట్టిగా నిలబడింది. దానితో నిన్న రాత్రి నిర్మాతలమండలి ఓ ప్రకటన విడుదలచేసింది.