టాలీవుడ్‌లో విషాదం: పునాదిరాళ్లు దర్శకుడు.. ఉదయ్ కిరణ్‌ల మృతి

శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:14 IST)
chiru First Director
పరారే పరారే.. ఫ్రెండ్స్ బుక్ సహా పలు తమిళ సినిమాల్లో ఉదయ్ కిరణ్ నటించాడు. అయితే ఉదయ్ కిరణ్ శుక్రవారం రాత్రి కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని రామారావుపేటలోని నివాసం ఉంచారు. ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాదిరాళ్లు'. ఈ సినిమా దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కారణంగా బాధపడుతోన్న ఆయన శనివారం తనువు చాలించారు. రాజ్‌కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగాస్టార్ అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించారు. రాజ్‌కుమార్‌ స్వస్థలం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు.
 
కాగా.. భౌతికకాయాన్ని ఉయ్యూరు తరలించేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాజ్‌కుమార్‌ పెద్ద కుమారుడు మరణించారు. ఆ తర్వాత భార్య కూడా మృతి చెందడంతో ఒంటరివాడు అయ్యాడు. అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. రాజ్‌కుమార్‌ తన మొదటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా ఆ చిత్రానికి ఐదు నంది అవార్డులు దక్కించుకొని గుర్తింపు పొందారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు