దీని ప్రకారం హైదరాబాద్-బెంగళూరు కారిడార్ 605 కి.మీ విస్తరించి ఉంటుంది. హైదరాబాద్-చెన్నై కారిడార్ 760 కి.మీ. కవర్ చేస్తుంది. రెండు లైన్లు కలిపి 1,365 కి.మీ. విస్తరించి ఉంటాయి, 767 కి.మీ ఆంధ్రప్రదేశ్ గుండా వెళుతుంది. దక్షిణ మధ్య రైల్వే ఈ రెండు ప్రాజెక్టులకు మొత్తం రూ.5.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. హైదరాబాద్-బెంగళూరు లైన్కు రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్-చెన్నై లైన్కు రూ.3.04 లక్షల కోట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్లో, తొలుత ఈ పనులు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్-బెంగళూరు కారిడార్ రాష్ట్రంలో 263 కి.మీ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల గుండా వెళుతుంది. ఇందు కోసం ఆరు కొత్త స్టేషన్లకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం భూమి కోరుతూ ఎస్సీఆర్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
హైదరాబాద్-చెన్నై కారిడార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అనే ఏడు జిల్లాల గుండా వెళుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా ఈ మార్గంలో చేర్చాలని అధికారులు పరిశీలిస్తున్నారు.