దడపుట్టిస్తున్న 'దండుపాళ్యెం-4' (ట్రైలర్)

శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:40 IST)
గతంలో వచ్చిన చిత్రం దండుపాళ్యెం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు సీక్వెల్స్ చిత్రాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్ సాధించాయి. తాజాగా దండుపాళ్యెం-4 పేరుతో మరో చిత్రంరానుంది. ఈ సిరీస్ పేరుతో వచ్చిన చిత్రాల్లో పూజా గాంధీ, రఘు ముఖర్జీలు ప్రధాన తారాగణంగా నటించారు. 
 
వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్‌ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాసరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వ‌చ్చిన చిత్రాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. తాజాగా సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా "దండుపాళ్యం 4" చిత్రం తెర‌కెక్కుతుంది. 
 
కె.టి.నాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు ‘దండుపాళ్యం 4’ నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో హింస‌, శృంగారం త‌దిత‌ర అంశాలు ఎక్కుగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు